365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 4,2025:బోయిన్పల్లిలోని పల్లవి మోడల్ స్కూల్లో 2025, జనవరి 4న 12వ తరగతి అవుట్గోయింగ్ బ్యాచ్కి ఇచ్చే వీడ్కోలు వేడుక ఘనంగా జరిగింది. ‘మీమ్స్ టు మెమోరీస్’ అనే థీమ్పై ఈ వేడుక అద్భుతంగా జరిగింది.
ఈ సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్ట్సిట్యూషన్స్ చైర్మన్ మల్కా కొమరయ్య మాట్లాడుతూ, విద్యార్థులు తమ భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి సారించాలని కోరారు. అవుట్గోయింగ్ విద్యార్థులు పాఠశాలకు కృతజ్ఞతా టోకెన్ను బహుమతిగా అందించారు.
స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి రేణుత చక్రవర్తి మాట్లాడుతూ, విద్యార్థులు బోర్డు ఎగ్జాముల వైపు పురోగమిస్తున్నప్పుడు సమతుల్య, కేంద్రీకృత విధానాన్ని కలిగి ఉండాలని సూచించారు.
విద్యార్థులు తమ శైలి, ఆత్మవిశ్వాసం, చరిష్మాతో ర్యాంప్ పోటీలో పాల్గొన్నారు. వివాన్ శంకర్ ధావన్, క్రిషా సింఘ్వి వరుసగా ప్రతిష్టాత్మకమైన మిస్టర్, మిస్ పల్లవి టైటిల్స్ గెలుచుకున్నారు. సయోనారా 2025 వేడుక రాబోయే సంవత్సరాల్లో విద్యార్థులు, సిబ్బంది జ్ఞాపకాలలో నిలిచిపోతుంది.

