అమర్ నాథ్ యాత్ర 2026 అధికారికంగా ప్రారంభమైంది.
జూలై 3న ప్రారంభమైన యాత్ర ఆగష్టు 28 వరకు కొనసాగుతుంది
పవిత్రమైన అమర్ నాథ్ గుహల్లో సహజంగా ఏర్పడిన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఈ కఠిన యాత్ర చేస్తారు
హిమాలయాల మధ్యలో 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర క్షేత్రానికి ఈ ఏడాది భారీగా భక్తులు తరలివస్తున్నారు
ఈ పుణ్యక్షేత్రానికి చేరుకునేందుకు సంప్రదాయ మార్గం అయిన 35 కిలోమీటర్లు ఉండే పహల్గామ్ మీదుగా కానీ.. నిటారుగా ఉండి కేవలం 14 కిలోమీటర్లు ఉండే బల్టాల్ మార్గంలో కానీ వెళ్లొచ్చు
ఆగష్టు 28వరకు కొనసాగే యాత్రకోసం ఆగష్టు 12 వరకూ ముందస్తు నమోదు చేసుకోవచ్చు..బుకింగ్ చేసుకోనివారికి స్పాట్ బుకింగ్ అవకాశం ఉంటుంది కానీ రద్దీ ఎక్కువ ఉంది
యాత్రకు వచ్చే భక్తులు వైద్యుల నుంచి ఆరోగ్య ధృవీకరణ పత్రాలు తీసుకురావాలి.
ఈ ఏడాది రద్దీ ఎక్కువ ఉండడంతో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
శివుడి అనుగ్రహం కోసం భక్తులు శారీరక, మానసిక కష్టాలు సహిస్తూ పంచాక్షరి జపిస్తూ సాగిపోతారు
అమర్నాథ్ యాత్ర బల్తాల్ మార్గం నుండి ప్రారంభమవుతుంది.

