ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిపై సందిగ్ధత వీడింది. చైర్మన్గా భరత్ భూషణ్, వైస్ చైర్మన్గా మెహర్ రమేష్ ను నియమించింది ప్రభుత్వం. మరో 14 మందిని డైరెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
డైరెక్టర్లుగా సినీ రచయిత, తెనాలి కళల కాణాచి పరిషత్ నిర్వాహకులు బుర్ర సాయి మాధవ్, చిలకలూరిపేటకు చెందిన రిటైర్డ్ అధ్యాపకులు, రచయిత డా. కందిమళ్ల సాంబశివరావులను డైరెక్టర్లుగా నియమించారు.
నటులు సుమన్, శివాజీ, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, కూచిభోట్ల వివేకానంద, నటి ఝాన్సీ, సీనియర్ జర్నలిస్ట్ కె.ఉమా మహేశ్వరరావు, దర్శకుడు వి. సముద్ర, మీర్ ఎస్. ఎ.సత్యనారాయణ, ఎస్.వెంకట కృష్ణారెడ్డి, జి.రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణలను నియమించారు.
