ఏపీ సీఎం చంద్రబాబు అధ్యతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాజకీయ పార్టీల కార్యాలయాల భూముల లీజు గడువు 66 ఏళ్లకు పెంపుపై చర్చ
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్పై పీపీపీ విధానంలో ఎయిర్పోర్ట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్
విశాఖలో రిలయన్స్ భారీ AI డేటా సెంటర్కు పచ్చజెండా
రిలయన్స్ ప్రాజెక్ట్ కోసం 854 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం
ఓర్వకల్ సోలార్ సెల్ తయారీ యూనిట్కు గ్రీన్ సిగ్నల్
విద్యుత్ శాఖలో 629 AEE పోస్టుల భర్తీపై చర్చ
తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ భారీ ప్లాంట్పై చర్చ
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు మంజూరు
మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.790 కోట్లకు ఆమోదం
చిత్తూరులో అపోలో టైర్ విస్తరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
అగ్రిగోల్డ్ బాధితుల కేసులు వేగవంత విచారణకు ప్రత్యేక బృందం
నెల్లూరులో భారీ ఎంజైమ్ తయారీ కేంద్రానికి అనుమతి
శ్రీసత్యసాయి జిల్లాలో రిలయన్స్ మెగా సోలార్ ప్రాజెక్టుకు ఏపీ కేబినెట్ ఆమోదం
