రాజమండ్రిలో పాల కల్తీ పాల ఘటన మరువక ముందే మరో దుర్ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని ఎస్.కొండేపాడులో ఫుడ్పాయిజన్ కలకలం రేపింది.
నిల్వ ఉంచిన మైదా పిండితో చేసిన బజ్జీలు తినడంతో 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బజ్జీలు తిన్న వెంటనే వాంతులతో అపస్మారక స్థితికి వెళ్లడంతో ఆసుపత్రికి తరలించారు. భీమవరంలో ప్రైవేటు ఆస్పత్రులలో 8 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతు బాధితులు వీరే..
1). నక్కా కాసులమ్మ( మహిళమహిళ-60)
2). ఈది సుజాత (43)
3). కొండోటి ధనమ్మ (40)
4). పచ్చ వెంకటలక్షి (45)
5). పచ్చ దీపిక (28)
6). మోకమట్ల శ్రీను ( 45)
7). మోకమట్ల దుర్గ (40)
8). మోకమట్ల కన్నయ్య (03)
9). మోకమట్లసరస్వతి (25) 3 నెలలగర్భవతి
10). తోట సుబ్బలక్షి (38)
11). తోట సత్యనారాయణ (42)
