తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పరిధిలోని జంబుపట్నంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మట్టి లోడ్తో అతివేగంగా వచ్చిన ఒక టిప్పర్ లారీ బైక్ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నొక్కి రాజు వర్మ (27) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వైసిపి నేత, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసిపి నాయకులు ఘటన స్థలానికి చేరుకుని ధర్నాకు దిగారు.
రాత్రివేళల్లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతూ, మితిమీరిన వేగంతో లారీలు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగారు.ఈ నేపథ్యంలో కోరుకొండ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
