Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

నీళ్ళు కావాలని..మైనర్ బాలిక మీద అఘాయిత్యం

వికారాబాద్ జిల్లాలో అత్యంత హేయమైన ఘటన వెలుగుచూసింది. నీళ్లు అడిగే నెపంతో ఇంట్లోకి ప్రవేశించిన ఓ యువకుడు, ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

కేవలం 14 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

యాలాల మండలం బెన్నూర్ గ్రామానికి చెందిన షేక్ ఫరన్ (18) అనే యువకుడు, బాధిత బాలిక ఇంటి పక్కనే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో, బాధిత బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించిన నిందితుడు.. ఫోన్ చార్జర్ మరియు త్రాగడానికి నీళ్లు కావాలనే సాకుతో ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన తర్వాత బాలికపై బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు షేక్ ఫరన్ పై POCSO (పోక్సో) చట్టంతో పాటు, రేప్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితుడు: షేక్ ఫరన్ (18), బెన్నూర్, యాలాల మండలంకి చెందిన వ్యక్తి. నిందితుడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళలు మరియు చిన్నారులపై జరుగుతున్న ఇటువంటి అఘాయిత్యాలను సహించేది లేదని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. మైనర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, దాడులకు పాల్పడినా పోక్సో చట్టం కింద కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu