Dailyhunt
పెళ్లి చేయట్లేదని తల్లిని చంపేశాడు!

పెళ్లి చేయట్లేదని తల్లిని చంపేశాడు!

ర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. పెళ్లి జరిపించలేదని తల్లిపై కోపంతో కుమారుడు దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటన హాసన్ జిల్లాలోని శ్రవణబెలగొళ చన్నరాయపట్న తాలూకాలో జరిగింది. 65 ఏళ్ల గంగమ్మ అనే వృద్ధురాలు తన ఇంట్లో కుమారుడి దాడికి గురై తీవ్రంగా గాయపడింది.

తీవ్ర గాయాలతో ఆమెను HIMS ఆసుపత్రిలో ICUలో చేర్చగా, చికిత్స పొందుతూ మార్చి 30 అర్ధరాత్రి సమయంలో మృతి చెందింది. పోలీసులు 40 ఏళ్ల ఉమాశంకర్‌ను నిందితుడిగా గుర్తించారు.

అతను తరచూ తన కుటుంబంపై పెళ్లి చేయమని ఒత్తిడి తెచ్చేవాడు.ఈ విషయంపై తల్లితో తరచూ గొడవలు జరిగేవి.మార్చి 26న ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, కోపంతో ఉమాశంకర్ తన తల్లిపై దాడి చేశాడు.ఆమె కుప్పకూలిన తర్వాత కూడా రాయితో తలపై కొట్టినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది:

సంవత్సరం క్రితం కుంభమేళా నుంచి వస్తూ ప్రమాదంలో గాయపడ్డాడు.అప్పటి నుంచి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.కొన్నిసార్లు అతని ప్రవర్తన అసహజంగా ఉండేదని స్థానికులు తెలిపారు ఈ ఘటనపై శ్రవణబెలగొళ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu