Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

పుల్వామా దాడి మాస్టర్ మైండ్ బురాన్ హత్య

భారతదేశంపై జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడులలో ఒకటైన 'పుల్వామా దాడి' వెనుక ఉన్న ముఖ్య సూత్రధారి, లష్కరే తోయిబా (LeT) అగ్ర కమాండర్ హంజా బుర్హాన్ అలియాస్ అబు అక్వెల్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో హతమయ్యాడు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి ప్రాంతంలో హంజా బుర్హాన్ తన అనుచరులతో కలిసి వెళ్తుండగా మోటార్ సైకిళ్లపై వచ్చిన కొందరు గుర్తుతెలియని సాయుధులు అతనిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బుర్హాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అతని బాడీగార్డ్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దాడి అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

2019 ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ (CRPF) కాన్వాయ్‌పై జరిగిన ఆత్మహుతి దాడిలో 40 మంది భారతీయ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ దాడికి వ్యూహరచన చేయడంలో మరియు ఉగ్రవాదులకు అవసరమైన ఐఈడీ (IED) పేలుడు పదార్థాలను, నిధులను సమకూర్చడంలో హంజా బుర్హాన్ అత్యంత కీలకమైన పాత్ర పోషించాడు. అప్పటి నుంచి భారత భద్రతా సంస్థల మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఇతడు ఉన్నాడు.

గత కొంతకాలంగా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు పాకిస్తాన్ మరియు పీఓకే పరిసర ప్రాంతాలలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో వరుసగా హతమవుతుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పాకిస్తాన్ రక్షణ మరియు పోలీసు వర్గాలు విచారణ జరుపుతున్నప్పటికీ, దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ సంస్థ కూడా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu