భారత క్రికెట్ జట్టు మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి టీమిండియా కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శామ్సన్ను భవిష్యత్తులో భారత టీ20 జట్టుకు నాయకత్వం వహించగల సమర్థుడిగా ఆయన అభివర్ణించారు.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టును సంజూ నడిపిస్తున్న తీరును రవిశాస్త్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా అతను ఎంతో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటాడని శాస్త్రి పేర్కొన్నారు.
సంజూకు ఆటపై మంచి పట్టు ఉంది. మైదానంలో అతని వ్యూహాలు మరియు బౌలింగ్ మార్పులు చాలా పరిణతి చెందినట్లుగా ఉంటాయి. భవిష్యత్తులో టీ20 ఫార్మాట్లో భారత్కు నాయకత్వం వహించే అన్ని లక్షణాలు అతనిలో ఉన్నాయి అని శాస్త్రి అన్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టును ప్లేఆఫ్స్ రేసులో నిలబెట్టడం మరియు ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టడంలో సంజూ సక్సెస్ అయ్యాడని ఆయన విశ్లేషించారు.
ప్రస్తుతం భారత జట్టులో కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి వారు ఉన్నప్పటికీ.. రవిశాస్త్రి వంటి దిగ్గజం సంజూ శామ్సన్ పేరును ప్రతిపాదించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే ఐసీసీ టోర్నీల దృష్ట్యా యువ నాయకత్వం వైపు బీసీసీఐ మొగ్గు చూపితే సంజూ కీలక అభ్యర్థిగా మారే అవకాశం ఉంది.
నిలకడైన బ్యాటింగ్ ప్రదర్శనతో పాటు కెప్టెన్సీలోనూ సంజూ తన మార్క్ చూపిస్తుండటం అతని ప్లస్ పాయింట్గా మారుతోంది.
