పాఠశాలలు, ఆసుపత్రులు మరియు ఇతర ప్రజా ఉపయోగకర సంస్థలు ఉన్న ప్రాంతాల నుండి వీధి కుక్కలను తొలగించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చడానికి సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది.
అంతేకాకుండా, ఆయా ప్రాంతాల నుండి పట్టుకున్న కుక్కలకు వ్యాక్సినేషన్ (టీకాలు) లేదా స్టెరిలైజేషన్ (కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స) చేసిన తర్వాత.. తిరిగి మళ్లీ అదే ప్రాంతాల్లో వదిలిపెట్టకూడదనే నిబంధన కూడా యథాతథంగా అమలులో ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
నవంబర్ 7 నాటి మా తీర్పును ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలైన దరఖాస్తులను మేము నిశితంగా పరిశీలించాము, అయితే వాటన్నింటినీ మేము తిరస్కరిస్తున్నాము అని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
వీధి కుక్కల సమస్యపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. కుక్క కాట్ల ముప్పు విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలతో సహా అత్యంత కీలకమైన బహిరంగ ప్రదేశాలకు కూడా విస్తరించింది అని కోర్టు పేర్కొంది. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ను సవాలు చేస్తూ దాఖలైన దరఖాస్తులను కూడా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
చిన్నారులపై కుక్కలు జరిపిన తీవ్ర కలతకు గురిచేసే దాడుల" నివేదికలను కోర్టు ప్రస్తావించింది. చిన్న పిల్లలను కుక్కలు పీల్చిపిప్పి చేయడం, వృద్ధులపై దాడులు జరగడం, చివరకు అంతర్జాతీయ ప్రయాణికులు సైతం కుక్కల దాడులను ఎదుర్కోవడం వంటి ఘటనలు జరిగాయని నివేదించింది.
జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల త్రిసభ్య ధర్మాసనం ఈ సుమోటో (Suo Motu) కేసులో తన తీర్పును వెలువరించింది. అధికారులు సుదీర్ఘకాలంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య ఇంతలా ముదిరి, ఆందోళనకర స్థాయికి చేరుకుందని ధర్మాసనం నొక్కి చెప్పింది.
అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా 'యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (AWBI) నిబంధనలను కఠినంగా అమలు చేయాలి.
ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం తన పరిధిలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక 'యానిమల్ బర్త్ కంట్రోల్' (జంతు జనన నియంత్రణ) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.
అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమ వద్ద యాంటీ-రేబిస్ వ్యాక్సిన్లు మరియు ఇమ్యునోగ్లోబులిన్స్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.

