Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2027 వన్డే ప్రపంచ కప్‌.. భువీని జట్టులోకి తీసుకోవాలి: అశ్విన్

2027 వన్డే ప్రపంచ కప్‌.. భువీని జట్టులోకి తీసుకోవాలి: అశ్విన్

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ 2027 సమీపిస్తోన్న నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్‌లో భారత తుది జట్టు గురించి అంచనా వేశాడు.

ఈ క్రమంలో స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకోవాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వే దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. విదేశీ పిచ్‌లపై భువీ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు.

'వన్డే ప్రపంచ కప్ 2027లో భువనేశ్వర్ కుమార్‌ను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఫస్ట్‌క్లాస్, విజయ్ హజారే ట్రోఫీ సహా అన్ని టోర్నీల్లో అతడిని ఆడించి దక్షిణాఫ్రికా ప్రపంచ కప్‌కు సిద్ధం చేయాలి. అక్కడ అతడి అనుభవం జట్టుకు ఎంతో అవసరం అవుతుంది' అని అశ్విన్ పేర్కొన్నాడు. 2022 తర్వాత వన్డేలు ఆడని భువనేశ్వర్.. ఐపీఎల్‌ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో 28 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. దీంతో ప్రపంచకప్‌కు జట్టును సిద్ధం చేసే క్రమంలో అతడిని మరోసారి పరిశీలించాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

మరోవైపు శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టులో భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగాలని అశ్విన్ సూచించాడు. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్‌దీప్ యాదవ్.. ఈ ముగ్గురినీ తుది జట్టులోకి తీసుకోవాలని అన్నాడు. అలాగే గాలేలో ఇటీవల సెంచరీ చేసిన యువ ప్లేయర్ సాయి సుదర్శన్ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉంటే శ్రీలంక స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం అతడికి ఉందని, అది భారత్‌కు అదనపు బలంగా మారుతుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

strong>

కామన్వెల్త్ గేమ్స్: పట్టుదలే పతకమైంది.. డిస్కస్ త్రోలో సీమా కళిరామన్‌కు కాంస్యం

దులీప్ ట్రోఫీ.. వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్ ఎలా చేశారు?: హర్షా భోగ్లే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy