8వ తరగతిలో 70శాతం హాజరు : సురేశ్‌

8వ తరగతిలో 70శాతం హాజరు : సురేశ్‌

ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి

1961d

Loading...

అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం నుంచి ప్రారంభించిన 8 నుంచి 10 తరగతులకు విద్యార్థుల హాజరు బాగుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. 8వ తరగతిలో 70, 9వ తరగతిలో 41.61, పదో తరగతిలో 46.28 శాతం విద్యార్థులు హాజరైనట్టు మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో ఈ మూడు తరగతుల విద్యార్థులు 5,70,742 మంది ఉండగా, 3,96,809 మంది హాజరయ్యారని తెలిపారు. డిసెంబరు 14 తర్వాత 6, 7 తరగతులు కూడా నిర్వహిస్తామన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy