Dailyhunt

ఆక్సిజన్ కోసం పరిగెత్తేలా చేశారు: నేతలపై బాలీవుడ్ హీరో విమర్శలు

ముంబై: కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. కోవిడ్ బారిన పడిన వారికి సరిగా ఆక్సీజన్ లభించడం లేదని, ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడం లేదనే వార్తలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఈ పరిస్థితికి పూర్తి కారణం రాజకీయ నేతలేనని బాలీవుడ్ హీరో సునిల్ శెట్టి తీవ్ర విమర్శలు గుప్పించారు. వాళ్లే మనల్ని ఆసుపత్రుల్లో బెడ్ల కోసం, ఆక్సీజన్ కోసం పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో చూసుకుని ఓటేయాలంటూ సునిల్ శెట్టి వ్యాఖ్యానించడం గమనార్హం.

''ఈ ఎన్నికల్లో గెలిచాం కదా అని పని చేయకుండా వచ్చే ఎన్నికల కోసమే ఆలోచిస్తున్నారు. ప్రతి రాజకీయ నాయకుడూ ఇంతే.

డబ్బులు ఎలా సంపాదించాలనే యావ తప్పితే ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన లేదు. అలాంటి వారిని ఎన్నుకున్న వారిలో మనం కూడా ఉన్నాం. మనం ఎన్నుకున్న వారే మనల్ని ఆక్సీజన్ కోసం, బెడ్ల కోసం పరుగులు తీయిస్తున్నారు. ఇవే కాదు ప్రతి ఒక్కదాని కోసం మనల్ని పరుగెత్తిస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటు జాగ్రత్తగా వేయండి'' అని సునీల్ శెట్టి అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy