అమ్మోనియం నైట్రేట్పై భద్రం సుమా .. ట్విటర్లో గవర్నర్
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రులు ప్రజలకు వైద్యం చేసే దేవాలయాలని, అందువల్ల అవి పూర్తి భద్రతను కలిగి ఉండేలా చూడాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ అధికారులకు సూచించారు. అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ అనేది అత్యంత ప్రాధాన్యం కావాలని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరుగకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది కొవిడ్ రోగులు మృత్యువాత పడిన నేపథ్యంలో హైదరాబాద్లో ఆస్పత్రుల రక్షణపై వచ్చిన కథనాలపై స్పందించిన గవర్నర్ ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు.
