బద్వేలు, అక్టోబరు 16: ''రాష్ట్ర ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. పరిపాలన సరిగా లేదు. రైతుల కష్టాలు తీరడం లేదు.
కనీసం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదు'' అని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. నవరత్నాల పేరుతో గారడి చేసి దోపిడీచేస్తున్నారని ఆరోపించారు.