Dailyhunt
అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం

అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం

జగిత్యాల బల్దియా వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌

గిత్యాల టౌన్‌, జనవరి 28 :అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని జగిత్యాల బల్దియా వైస్‌ చైర్మన్‌ గోళి శ్రీనివాస్‌ అన్నారు.

జిల్లా కేంద్రంలోని జగిత్యాల ప్రెస్‌ క్లబ్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కౌన్సిలర్లతో కలిసి వైస్‌ చైర్మన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సేవా భావంతో ప్రజలకు సేవ చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌పై నిరాధార ఆరోపణలు చేయడం చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణికి తగదన్నారు. బీఆర్‌ఎస్‌పై బురదజల్లె ప్రయత్నంలో భాగంగానే శ్రావణి రాజీనామా డ్రామా తెరమీదికి తెచ్చిందని దీని వెనుక నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ కుట్రలు దాగి ఉన్నాయని ఆరోపించారు. శ్రావణి రాజీనామాను ఆమోదించాలని కోరుతూ ఇప్పటికే మంత్రి ఈశ్వర్‌తో పాటు ఎ మ్మెల్సీ రమణ, ఎమ్మెల్యేలకు వివరించామన్నారు.

అనంతరం కౌన్సిలర్లు అవారి శివకేసరి బాబు, బండారి రజని, అడువాల జ్యోతి, పంబాల రామ్‌ కుమార్‌లు మాట్లాడుతూ బోగ శ్రావణి చైర్‌ పర్సన్‌ పదవిని సద్వినియోగం చేసుకోక పో వడంతోనే అవిశ్వాసానికి తెరలేపామని, ఇందులో ఎమ్మెల్యే ప్రమేయం లేదన్నా రు. ఎమ్మెల్యేపై శ్రావణి చేసిన ఆరోపణలు పూర్తిగా అవస్తామన్నారు. ఈ స మావేశంలో కౌన్సిలర్లు సమిండ్ల వాణి, బద్దం లత, లావణ్య, తోట మల్లిఖా ర్జున్‌, జగదీష్‌, అనీల్‌, రాజ్‌కుమార్‌, రాజేష్‌, గంగాసాగర్‌, ధర్మరాజు, నాయ కులు బాలె శంకర్‌, బండారి నరేందర్‌, సమిండ్ల శ్రీనివాస్‌, అడువాల లక్ష్మణ్‌, పవన్‌ ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy