Dailyhunt
ఐదుగురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతులు

ఐదుగురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతులు

అమరావతి: రాష్ట్రంలోని కొందరు సీనియర్ ఐఎఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యకార్యదర్శులుగా ఉన్న ఐదుగురు అధికారులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. వై.శ్రీలక్ష్మితో పాటు 1991 బ్యాచ్‌కు చెందిన జి. సాయిప్రసాద్, అజయ్ జైన్, ఆర్‌ఎస్‌ సిసోడియా, సుమితా దావ్రాలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల హోదా కల్పిస్తూ ఉత్తర్వులను వెలువరించింది.

కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ నుంచి అనుమతి వచ్చాకే వై.శ్రీలక్ష్మికి శాశ్వతంగా పదోన్నతి లభిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

సుమితా దావ్రాకు కూడా ప్రొఫార్మా ప్రాతిపదిక పదోన్నతి వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy