ఈదురుగాలుల తీవ్రతకు నేలవాలిన వరి
తడిచిన మిరపకాయలు, రాలిన మామిడి
పలు చోట్ల పిడుగుపాటు: ఎనిమిది పశువుల మృతి
రోడ్లపై పడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
కొత్తగూడెం, ఏప్రిల్ 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో బుధవారం రాత్రి పలుచోట్ల గాలివాన కురిసింది. సగటున 10.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తగూడెంలో అత్యధికం గా 36.2మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పిడుగులు పడడంతో జిల్లాలో ఎనిమిది పశువులు మృతిచెందాయి. బూర్గంపాడు మండ లంలో పిడుగుపాటుతో మూడు గేదెలు మృతిచెందాయి.

