అమరావతి: సోషల్ మీడియా పోస్టుల పేరుతో అరెస్టులు చేసి భయపెట్టలేరని జనసేన పీఏసీ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. విగ్రహాల ధ్వంసం ఘటనలపై సక్రమరీతిలో దర్యాప్తు చేయించలేని ప్రభుత్వం సోషల్ మీడియాలో ఆ ఘటనలపై పోస్టులు పెట్టారనే నెపంతో జనసేన కార్యకర్తలను అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. ''సోషల్ మీడియాలో పోస్టింగ్స్పై కేసులు పెట్టి అరెస్టులు చేయాలంటే ముందుగా వైసీపీ వాళ్ళనే జైళ్లకు పంపించాలి. వ్యవస్థలపైనా, వ్యక్తులపైనా ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న దుష్ప్రచారం ఆ పార్టీ పైశాచికత్వాన్ని తెలుపుతున్నాయి. హైకోర్టు, న్యాయమూర్తులపై వైసీపీ వాళ్లు చేసిన సోషల్ మీడియా పోస్టింగులుపై చర్యలేవి.

