Dailyhunt

అమ్మ దయతో న్యాయం జరుగుతుంది

669వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు

తుళ్లూరు, అక్టోబరు 16: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని రాజధాని రైతు ధర్నా శిబిరాలలో రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని అమ్మవారిని వేడుకున్నారు.

విజయదశమి రోజు అన్ని శిబిరాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి శనివారం గ్రామోత్సవాలు నిర్వహించారు. భూములు త్యాగంచేసిన రైతులకు అమ్మవారి దయతో న్యాయదేవత న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని 669 రోజులుగా ఆందోళనలు చేస్తుంటే సీఎం జగన్‌ కనీసం చర్చలకు కూడా పిలవలేదన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy