Dailyhunt

అమ్మవారి సన్నిధిలో డౌన్‌ డౌన్‌

నినాదాలు సిగ్గుచేటు: బుచ్చి రాంప్రసాద్‌

అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో సహనం కోల్పోయిన భక్తులు సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ చేసిన నినాదాలకు ప్రభుత్వం సిగ్గుపడాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్‌ విమర్శించారు.

అమ్మవారి నామ స్మరణతో మారుమోగాల్సిన దుర్గమ్మ సన్నిధి ముఖ్యమంత్రి డౌన్‌ డౌన్‌ నినాదాలతో దద్దరిల్లడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. తిరుమలలో టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి సతీమణి గోవింద నామ స్మరణ మాని జగన్‌రెడ్డి స్మరణ చేశారని ఆరోపించారు. ఈ అపచారాలకు బాధ్యత వహిస్తూ మంత్రి వెల్లంపల్లి తన పదవికి రాజీనామా చేయాలని ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy