Dailyhunt

అందుకే ముద్రగడ మనస్తాపానికి గురైయ్యారు: రాష్ట్ర కాపు సంఘ నేతలు

పశ్చిమ గోదావరి: భీమవరంలో రాష్ట్ర కాపు సంఘం నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాపులందరికీ నాయకుడు ముద్రగడ పద్మనాభం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆయన నాయకత్వంలోనే తాము నడుస్తామని చెప్పారు. తమలోని కొంతమంది నాయకులు మాటల వల్ల ముద్రగడ మనస్తాపానికి గురయ్యారని పేర్కొన్నారు. తామంతా ఏకమై ఆయన నాయకత్వంలోని ఉద్యమం కొనసాగిస్తామని వెల్లడించారు. 13 జిల్లాల నాయకులు త్వరలో తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy