ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్పై ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ కార్యక్రమాలలో తమిళత్తాయ్ గీతాన్ని మొదటగా ఆలపించాలనే తీర్మానాన్ని శాసనసభ ఆమోదించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ మేరకు కమల్ హాసన్ తన ఎక్స్ ఖాతాలో మంగళవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. 'ప్రభుత్వ కార్యక్రమాలలో తమిళత్తాయ్ గీతాన్ని మొదటగా ఆలపించాలనే తీర్మానాన్ని శాసనసభలో ఆమోదించడం సంతోషకరం. ఇది కచ్చితంగా స్వాగతించదగినది. రాష్ట్ర హక్కులను వదులుకోని ఈ విధానం ఇలాగే కొనసాగాలి' అని రాసుకొచ్చారు.
కేంద్రం వర్సెస్ తమిళనాడు..
రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో జాతీయ గేయమైన 'వందేమాతరం'ను మొదటగా ఆలపించాలని, ఆ తర్వాతే ఇతర గీతాలను ఆలపించాలని కేంద్ర హోంశాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలకు అంతర్గత మార్గదర్శకాలను, సూచనలను జారీ చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో ఈ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 'తమిళం కేవలం ఒక భాష మాత్రమే కాదు, అది మన ప్రాణం, భావోద్వేగం' అని ఆయన పేర్కొన్నారు. సీఎం విజయ్ ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక తీర్మానానికి అసెంబ్లీలోని ప్రధాన ప్రతిపక్షాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి.
>
రాజస్థాన్ వీడియోతో పంజాబ్లో రాజకీయ దుమారం.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

