Dailyhunt
బెంగళూరులో మెట్రో సర్వీసుల తగ్గింపు

బెంగళూరులో మెట్రో సర్వీసుల తగ్గింపు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో మెట్రో సర్వీసులను తగ్గించున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 28వ తేదీన బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్ సర్వీసులను తగ్గించనున్నట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సిఎల్) సిపిఆర్ఓ తెలిపింది.

సిపిఆర్‌ఓ ప్రకారం సివిల్ మెయింటెనెన్స్ పనుల వల్ల మెట్రో సర్వీసులను తగ్గించినట్లు పేర్కొన్నారు. ఉదయం 7 నుంచి ఉదయం 9 గంటల వరకు బైయప్పనహళ్లి, ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ల మధ్య ఈ సేవలు ప్రభావితమవుతాయని అధికారిక ప్రకటనలో తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy