హైదరాబాద్: నగరంలోని జాంబాగ్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్పై అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. తనకు ముగ్గురు సంతానం ఉన్నా.. ఇద్దరు సంతానం మాత్రమే ఉన్నారని పేర్కొంటూ గతంలో జరిగిన జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో అధికారులకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని ఎంఐఎం అభ్యర్థి జడల రవీందర్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో రాకేష్ జైస్వాల్పై కేసు నమోదయింది.

