అమరావతి: వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్ నవశకం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా వాలంటీర్లు గ్రామ, పట్టణాల్లో ఇంటింటి సర్వే చేయనున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు పలు రకాల కార్డుల జారీకి సర్వే చేసి.. బియ్యం కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, వైఎస్సార్ పెన్షన్ కానుక, విద్యాదీవెనకు ప్రత్యేక కార్డులు ప్రభుత్వం ఇవ్వనుంది.

