హైదరాబాద్: భారత బ్యాంకింగ్ రంగ సంస్కరణల పితామహుడు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ మైదవోలు నరసింహం ఇక లేరు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 94 ఏళ్లు. ఆర్బీఐ 13వ గవర్నర్గా 1977 మే 2 నుంచి నవంబరు 30 వరకు (7 నెలలు) బాధ్యతలు నిర్వహించారు. ఆర్బీఐ క్యాడర్ నుంచి గవర్నర్గా నియమితులైన తొలి, ఏకైక వ్యక్తి ఈయనే. ఆర్బీఐకి తొలి తెలుగు గవర్నర్ కూడా.
తొలుత నరసింహం ఆర్బీఐలోని ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ ఆఫీసర్గా చేరారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు నిర్వహిం చారు. గవర్నర్గా నియమితులు కాకముందు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు.
బ్యాంకింగ్ రంగానికి విశేష సేవలు

