హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఎంఎ్సఎన్ గ్రూపు అమెరికా మార్కెట్లో మరో కొత్త జనరిక్ ఔషధాన్ని విడుదల చేయబోతోంది. ఇందుకోసం సమర్పించిన అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్(అండా)కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డీఏ తుది ఆమోదం లభించింది. ఈ అండాస్ ఆధారంగా ఎంఎ్సఎన్ గ్రూపు, అసేనాపిన్ సబ్లింగ్యుయల్ అనే టాబ్లెట్లను 5 ఎంజీ మోతాదులో తయారు చేసి అమెరికా మార్కెట్లో విడుదల చేస్తుంది. వీటిని మనోవైకల్య, తీవ్ర మనోవైకల్య సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.
