అమరావతి: ఏపీలో పుర పోరు హోరెత్తుతోంది. రాష్ట్రంలో పురపోరు ఒక ఎత్తు అయితే విజయవాడ, గుంటూరు, విశాఖతో పాటు కర్నూలు నగర పాలక సంస్థల ఎన్నికలు మరో ఎత్తు అనే రీతిలో సాగుతోంది. ఇక ఈ ఎన్నికలు పార్టీల గుర్తులో జరుగుతుండటంతో రాష్ట్రంలో ఎవరి బలం ఎంత అనేది ఈ ఫలితాలతో తేలనుంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా రాజధాని తరలింపు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాలు కీలక పాత్ర పోషించనున్నాయి. మరోవైపు విశాఖలో నాన్ లోకల్ విభాగం రగులుతోంది. మున్సిపోల్స్లో ప్రజలు ఎటు మొగ్గు చూపుతారు?. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తారా? లేక తిప్పికొడతారా?. ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎక్ల్సూజివ్ స్టోరీ.
ఈ స్టోరీ వీడియో చూడగలరు.

