అమరావతి: ఏపీలో గత 24 గంటల్లో రికార్డు కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 1919 పాజిటివ్ కేసులు నమోదు కాగా 37 మంది చనిపోయారు. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఇదే మొదటిసారి. అనంతపురంలో ఆరుగురు, కర్నూలులో నలుగురు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరిలో నలుగురు చొప్పున చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ప్రకాశంలో ముగ్గురు చొప్పున కడప, నెల్లూరులో ఇద్దరేసి చొప్పున శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 37 మంది మృతి చెండడంతో ఏపీలో కరోనా కారణంగా ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 365కు చేరింది. ఇందులో మరణించిన వారిలో కర్నూలు జిల్లాలో 105 మంది, కృష్ణా జిల్లాలో 83 మంది అత్యధికంగా ఉన్నారు.

