Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో తీవ్రమైన కరోనా.. 24 గంటల్లో 37 మరణాలు..

ఏపీలో తీవ్రమైన కరోనా.. 24 గంటల్లో 37 మరణాలు..

అమరావతి: ఏపీలో గత 24 గంటల్లో రికార్డు కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 1919 పాజిటివ్ కేసులు నమోదు కాగా 37 మంది చనిపోయారు. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఇదే మొదటిసారి. అనంతపురంలో ఆరుగురు, కర్నూలులో నలుగురు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరిలో నలుగురు చొప్పున చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ప్రకాశంలో ముగ్గురు చొప్పున కడప, నెల్లూరులో ఇద్దరేసి చొప్పున శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 37 మంది మృతి చెండడంతో ఏపీలో కరోనా కారణంగా ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 365కు చేరింది. ఇందులో మరణించిన వారిలో కర్నూలు జిల్లాలో 105 మంది, కృష్ణా జిల్లాలో 83 మంది అత్యధికంగా ఉన్నారు.

గత 24 గంటల్లో దాదాపుగా 10.3 శాతం మందికి కరోనా టెస్టులు చేసిన వారిలో పాజటివ్ వచ్చింది. మొత్తం 19, 247 మందికి పరీక్షలు చేయగా ఇందులో 1,919 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో నమోదు అయిన కేసులను పరిశీలిస్తే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 313 కేసులు నమోదు అయ్యాయి. ఇక తర్వాతి స్థానంలో కర్నూలు జిల్లాలో 249, శ్రీకాకుళం జిల్లాలో 204, గుంటూరు జిల్లాలో 191, అనంతపురం జిల్లాలో 176, చిత్తూరు జిల్లాలో 168, కృష్ణా జిల్లాలో 111, నెల్లూరులో 99, ప్రకాశంలో 34, విశాఖలో 84, విజయనగరంలో 69, పశ్చిమగోదావరి జిల్లాలో 137 కేసులు నమోదు అయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 13 మందికి, ఇతర దేశాల నుంచి వారిలో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. మొత్తం 31,103 కేసులు ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదు కాగా ఇందులో 14,274 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 16, 464 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. గడిచి 24 గంటల్లో పరిశీలిస్తే.. 1,030 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని ప్రభుత్వం.. హెల్త్ బుటెటిన్ ను విడుదల చేసింది. అయితే మరణించిన వారి సంఖ్య అత్యధికంగా ఉండటం ఏపీలో కరోనా వ్యాప్తి, మరణాల రేటు కూడా పెరుగుతుందని చెబుతున్నారు. రికవరీ రేటు తగ్గడం, మరణాల రేటు పెరగడం మాత్రం ఒకింత ఆందోళన కలిగించే పరిణామంగా కూడా అందరూ భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy