Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హై కోర్టులో ఊరట

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హై కోర్టులో ఊరట

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు (HYDRA Commissioner Ranganath) తెలంగాణ హై కోర్టులో (Telangana High Court) ఊరట లభించింది.

శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసులో ఆయనపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్‌ను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 3వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. అప్పటి వరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని మార్చాలనే సింగిల్ బెంచ్ ఆర్డర్‌ను తాత్కాలికంగా డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.

తదుపరి ఆదేశాల వరకు లోతుకుంటా భూముల జోలికి వెళ్లవద్దని హై కోర్టు స్పష్టం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ తరఫున హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ రాజీవ్ శక్దర్ వాదనలు వినిపించారు. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసుపై అప్పీల్‌కు హైడ్రా కమిషనర్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే కేసులో రంగనాథ్‌ని తప్పించి మరో అధికారిని నియమించాలని సింగిల్ జడ్జి గతంలో తీర్పునిచ్చారు. ఈ క్రమంలోనే సింగిల్ జడ్జి తీర్పుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy