న్యూఢిల్లీ : లడఖ్లో ప్రధాని మోదీ పర్యటనపై కాంగ్రెస్ స్పందించింది. లోకసభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ... మోదీ పర్యటన కచ్చితంగా జవాన్లకు మంచి ప్రేరణను కల్పిస్తుందని వ్యాఖ్యానించారు. ఉద్రిక్తత జరిగిన ప్రాంతాలను ఆయన ఇంతకు ముందే సందర్శించి ఉండాల్సిందని అన్నారు. దేశ భూభాగంలో చైనా చొరబాటుదారులు ఎక్కడ ఉన్నా వారిని వెంటనే తరిమి కొట్టాలని అధీర్ డిమాండ్ చేశారు.

