ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు టూర్ అంటే ఎక్కువ ప్రదేశాలు తిరగడం, ఫొటోలు దిగడం ముఖ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు జెన్ Z యువత వేగంగా తిరిగే ట్రిప్ల కంటే ప్రశాంతమైన ప్రాంతాల్లో గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం యువత ఒకే ప్రదేశంలో కొన్ని రోజులు లేదా వారాల పాటు గడపడానికి ఇష్టపడుతున్నారు. అక్కడి సంస్కృతి, ఆహారం, స్థానిక జీవనశైలిని దగ్గరగా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ విధానాన్ని 'స్లో ట్రావెల్'గా పిలుస్తున్నారు.
ప్రశాంతమైన ప్రదేశాల వైపు మొగ్గు
రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాలు, భారీ క్యూలు, వాణిజ్య వాతావరణం వంటి వాటికి బదులుగా ప్రశాంతమైన ప్రాంతాలను యువత ఎంచుకుంటున్నారు. ఉదాహరణకు గోవా కంటే గోకర్ణ వంటి ప్రశాంతమైన ప్రాంతాలపై ఆసక్తి పెరుగుతోంది. ఇలాంటి ప్రదేశాల్లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, ఒత్తిడి లేకుండా గడపడానికి అవకాశం ఉంటుందని యువత భావిస్తున్నారు.
మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం
ఇప్పటి ప్రయాణాల ఉద్దేశ్యం కేవలం కొత్త ప్రదేశాలు చూడటం మాత్రమే కాదు. మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత కూడా ముఖ్యమవుతోంది. అందుకే వెల్నెస్ రిట్రీట్స్, యోగా కేంద్రాలు, ప్రకృతి మధ్యలో ఉన్న ప్రాంతాలు యువతను ఆకర్షిస్తున్నాయి.
ఆహారం కూడా భాగమే
ప్రస్తుతం ఆహారం కూడా ట్రావెల్ అనుభవంలో ముఖ్య భాగంగా మారింది. ముఖ్యంగా సముద్ర తీరంలోని కేఫ్లు, చిన్న రెస్టారెంట్లలో స్థానిక వంటకాలను రుచిచూడటానికి యువత ఆసక్తి చూపుతున్నారు. తాజా పదార్థాలతో చేసిన ఆహారం, ప్రశాంతమైన వాతావరణం, అలల శబ్దం వంటి అనుభూతులను ఆస్వాదించేందుకు ఇష్టపడుతున్నారు.
హోటళ్లు, కేఫ్లకు కొత్త అవకాశాలు
ప్రయాణ ధోరణిలో వస్తున్న ఈ మార్పు హోటల్, కేఫ్ యజమానులకు కూడా కొత్త అవకాశాలను తెచ్చిపెడుతోంది. ఇప్పుడు ప్రయాణికులు కేవలం గది లేదా భోజనం కోసం కాకుండా, మంచి అనుభూతి కోసం వస్తున్నారు. అందుకే కేఫ్లు, హోటళ్లు ఆహారంతో పాటు ప్రశాంతమైన వాతావరణం, స్థానిక సంస్కృతి అనుభూతిని అందించేలా మారాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
బంగాళదుంపలు త్వరగా ఉడకాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి
మా ప్లేయర్ల పరువుకు భంగం కలిగిస్తే సహించేది లేదు: ప్రీతి జింటా
For More Latest News

