Dailyhunt

జోగినిలకు ఉపాధి చూపుతాం: ఎర్రోళ్ల

హైదరాబాద్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): జోగినిలకు ఉపాధి కల్పించే విషయమై చొరవ చూపుతామని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. జోగినిల సమస్యలపై నివేదికలు ఇవ్వాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు కమిషన్‌ తరఫున ఇప్పటికే లేఖలు రాశామని వెల్లడించారు. పలువురు జోగినిలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. జోగినిల స్థితిగతులు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy