పట్టపగలు లోక్సత్తా జిల్లా అధ్యక్షుడిపై దాడి
వైసీపీ నేత మాధవరెడ్డి కుట్ర పన్నాడని ఆరోపణ
రాయదుర్గంటౌన, అక్టోబరు 27: కళ్లలో కారంపొడి చల్లి తనను హ తమార్చేందుకు వైసీపీ నేత మాధవరెడ్డి కిరాయి గూండాలతో దాడి చే యించాడని లోక్సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ (బాబు) ఆరోపించారు.
దాడి దుర్మార్గం : కాలవ
అధికార వైసీపీ అక్రమాలకు అడ్డుపడుతున్నాడనే కక్షతో లోక్సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణపై పట్టపగలు ప్రధాన రహదారిపై దాడికి తెగపడటం దుర్మార్గమని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కా లవ శ్రీనివాసులు విమర్శించారు. వెంకటరమణపై దాడి విషయాన్ని తెలుసుకున్న ఆయన బుధవారం ఫోన్లో మాట్లాడారు. భౌతిక దాడులకు భయపడొద్దని ధైర్యం నూరిపోశారు. వైసీపీ నాయకుడు మాధవరెడ్డి ప్రభుత్వ స్థలంతోపాటు రోడ్డును ఆక్రమించుకుని నిర్మిస్తున్న ఇంటి విషయంలో వెంకటరమణపై కక్ష పెంచుకుని, దాడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రశాంతమైన రాయదుర్గంలో పట్టపగలు ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని దుస్థితిని వైసీపీ గూండాలు కల్పించారని దుయ్యబట్టారు. ప్రభుత్వ విప్ కాపు రా మచంద్రారెడ్డి ఒత్తిడితో మాధవరెడ్డి అక్రమ నిర్మాణంపై అధికారులు చర్య లు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. నియోజకవర్గం లో వైసీపీ నాయకుల భూకబ్జాలకు అంతులేకుండా పోతోందని మండిపడ్డా రు. ప్రభుత్వ విప్ బంధువులు, అనుచరులు.. ప్రజల ఆస్తులను యథేచ్ఛగా దోచేస్తున్నారని, అధికార పార్టీ ఆగడాలపై ఉద్యమిస్తామని హెచ్చరించారు.

