కేంద్రం 51,626 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది
మరో లక్ష టన్నుల కొనుగోలుకు సిద్ధంగా ఉంది: కిషన్రెడ్డి
బేగంపేట, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కందుల ఉత్పత్తిని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. కంది రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కేటాయించకపోగా, ఒక్క టన్ను కందులను కూడా కొనుగోలు చేయలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 51,626 మెట్రిక్ టన్నుల కందులను కొనుగోలు చేసిందని, మరో లక్ష టన్నులు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
ఆదివారం దిల్కుష్ గెస్ట్హౌ్సలో నాఫెడ్, మార్క్ఫెడ్, మార్కెటింగ్ శాఖల అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

