Dailyhunt
కరోనా పేరుతో ప్రభుత్వ ప్రకటనలు కోడ్ ఉల్లంఘనే: రఘురామ

కరోనా పేరుతో ప్రభుత్వ ప్రకటనలు కోడ్ ఉల్లంఘనే: రఘురామ

న్యూఢిల్లీ: ఏపీలో కరోనా పేరుతో ప్రభుత్వ ప్రకటనలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ మాస్క్ పెట్టుకుని ప్రభుత్వ ప్రకటన ఇస్తే బాగుండునని అన్నారు. మదర్ ఫ్లోరా ఫైత్ మినిస్ట్రీస్ సర్వీస్ సొసైటీ క్రైస్తవ సంస్థలో నందిగాం సురేష్ సభ్యుడని, హిందూ దళితుడైన నందిగాం సురేష్‌ ఆ సంస్థలో ఎలా సభ్యుడవుతావుతారని రఘురామ నిలదీశారు. ఆ సంస్థకు రూ. 17.70 కోట్ల విదేశీ నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నందిగాం సురేష్‌ హిందువని చెప్పి ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని, నందిగాం సురేష్‌ మతంపై విచారణ జరపాలన్నారు. నిన్న వైఎస్ షర్మిలపై దాడి చేసిన మహిళా పోలీసులపై చర్యలు తీసుకోవాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy