చిత్రపరిశ్రమలో కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఛాయాగ్రాహకుడు జానీలాల్ బుధవారం రాత్రి ముంబైలో కన్నుమూశారు. ప్రస్తుతం ఓ హిందీ చిత్రానికి పనిచేస్తున్న ఆయన రెండు వారాల క్రితం కరోనా బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి ఆయన మరణించారు. హృతిక్ రోషన్ నటించిన 'యాదేన్', సునీల్ శెట్టి 'లాకీర్', గోవిందా, సల్మాన్ ఖాన్ నటించిన 'పార్టనర్', తుషార్ కపూర్ తొలి సినిమా 'ముఝే కుచ్ కెహనా హై' తదితర చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా కూడా పనిచేశారు. నటులు మాధవన్, తుషార్ కపూర్ తమ తొలి హిందీ చిత్రాలకు జానీలాల్ పనిచేసిన సంగతి గుర్తు చేసుకొని ఆయనకు నివాళులు అర్పించారు.

