అమరావతి: రంగుల విషయం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడానికి సంబంధించి దాదాపు వెయ్యికోట్లకుపైగా ప్రభుత్వ ధనాన్ని కేటాయించి రంగులు ఎందుకు వేస్తారంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దానిపై హైకోర్టు ఓ తీర్పు చెప్పింది. రంగులు వేయొద్దంటూ మార్చి 10న హైకోర్టు తీర్పు చెప్పగా దానికి విరుద్ధంగా ఏప్రిల్ 23న ప్రభుత్వం 623 జీవోను తీసుకువచ్చింది. ఈ జీవో ప్రకారం ఉన్న రంగులు తొలగించడం కాకుండా కొత్త రంగును జతపరుస్తూ... కొత్త భాష్యం చెబుతూ...నాలుగు రంగులు వేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది.
ఇది కచ్చితంగా కోర్టు తీర్పును ఉల్లంఘించడమే అంటూ మరో పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. దానిపై విచారణ జరిపిన కోర్టు 623 జీవోను కొట్టివేసింది.

