చిత్తూరు: ఇటీవలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రవ్యాఖ్యలు చేసిన జడ్జి రామకృష్ణను మదలనపల్లెలో అరెస్ట్ చేశారు. సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేసినందునే ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి పీలేరు వైపు తీసుకువెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మదనపల్లెలో అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇక్కడ కస్టడీలోకి తీసుకోకుండా వేరే ప్రాంతానికి తీసుకెళ్లడమేంటని రామకృష్ణ కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
