ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బుధవారం మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాటక సరిహద్దుల్లో మరాఠీ ఎక్కువగా మాట్లాడే ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు చివరి తీర్పు ఇచ్చే వరకూ కేంద్రం ఈ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల మధ్య సరిహద్దు వివాదం చెలరేగిన వివాదంపై ఓ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం ఉద్ధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును ఎలాగైనా గెలవాల్సిన అవసరం ఉందని సీఎం ఉద్ధవ్ నొక్కి వక్కానించారు.
కర్నాటకలో ఉన్న మరాఠా ప్రాంతాలను ఎప్పటికైనా మహారాష్ట్రలో తిరిగి కలుపుకుంటామని కొన్ని రోజుల క్రితం సీఎం ఉద్ధవ్ ట్వీట్ చేశారు.

