హైదరాబాద్: మీడియా పాయింట్ ను అసెంబ్లీ ప్రాంగణంలోకి మార్చాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.
అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి
పాఠశాలలలో ఇప్పటి వరకు ఉపాధ్యాయుల సర్దుబాటు జరగలేదన్నారు. తక్షణం ఉపాధ్యాయులను, గెస్ట్ ఫ్యాకల్టీని నియమించాలని అన్నారు. పీఈడీ ఉపాధ్యాయులను వెంటనే భర్తీ చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి స్థాయిలోని విద్యాశాఖ నిర్ణయాలు జరగాలని ఆయన అన్నారు. ప్రతి అంశం సీఎం దగ్గరకు పోవడంతో విద్యాశాఖ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతోందని విమర్శించారు. పాఠశాలలలో ఇప్పటి వరకు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించలేదన్నారు. 50 వేల మంది ఉపాధ్యాయులకు ఇంకా పీఆర్సీ వర్తించబడలేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు 20 రోజుల పాటు జరగాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పేర్కొన్నారు.
బుల్లెట్ రైలు గుజరాత్కేనా?.. హైదరాబాద్కు అర్హత లేదా?: కేటీఆర్
తెలంగాణలో కొత్తగా 3837 కరోనా కేసులు
