హైదరాబాద్: డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు రవాణా, వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు మినిస్టర్స్ క్వాటర్స్ ముట్టడికి యత్నించారు. లోనికి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలన పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్స్టేషన్కు తరలించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా యూజీసీ మార్గనిర్దేశకాలు పాటించి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలన్నీ ఒక సమూహంగా ఏర్పడి తెలంగాణను ఒక యూనిట్గా పరిగణలోకి తీసుకొని ఉమ్మడి పరీక్షలు నిర్వహించాలన్నారు. స్థానికంగా ఉన్న యూనివర్సిటీ పరిధిలో పరీక్ష రాసుకొనే వెసులుబాటు కల్పించి, రవాణా సౌకర్యం కల్పించాలని తెలిపారు.
