Dailyhunt
ముగిసిన ముత్యాలపోచమ్మ ఆలయ వేడుకలు

ముగిసిన ముత్యాలపోచమ్మ ఆలయ వేడుకలు

ఖానాపూర్‌, మార్చి 7 : మండల కేంద్రంలో మూడు రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్న ముత్యాలపోచమ్మ ఆలయ వేడు కలు ఆదివారం తెల్లవారుజామున ముగిశా యి. చివరి రోజైన శనివారం రాత్రి అమ్మవారి కి భక్తులు బోనాలు సమర్పించారు. పట్టణం లోని పురవీధులలో అమ్మవారి సదర్‌బోనాల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. పట్ట ణంలోని పలు కాలనీల నుంచి అధిక సంఖ్య లో భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పిం చారు. వేడుకల ముగింపు సందర్భంగా శనివా రం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఆలయ ఆవరణలో జాతర నిర్వహిం చారు. దీంతో భక్తులు తరలిరావడంతో దుకా ణ సముదాయాలతో పాటు ఆలయ ప్రాంగ ణం కళకళలాడింది. దుకాణ సముదాయాల వద్ద చిన్నారుల సందడి కనిపించింది.

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒగ్గుకథా కా లక్షేపం ఆకట్టుకుంది. మున్సిపల్‌ చైర్మన్‌, ఆల య కమిటీ అధ్యక్షుడు అంకం రాజేందర్‌, ఉ పాధ్యక్షుడు నాగేందర్‌ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చే శారు. వాటిని పర్యవేక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పూజలు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy