Dailyhunt

నామినేషన్‌ విత్‌డ్రాపై మహిళల నిరసన

ఆళ్లగడ్డ, మార్చి 6: ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో 22వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉషారాణి నామినేషన్‌ వేశారు. ఆ తర్వాత వైసీపీ నాయకుల ఒత్తిళ్లతో ఆమె నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆ వార్డుకు చెందిన కొంతమంది మహిళలు శనివారం పాతబస్టాండు వద్ద బైఠాయించారు. అనంతరం మున్సిపల్‌ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లారు. ఆమె నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవడంతో ఓటు వేయలేక పోతున్నామని కమిషనర్‌కు విన్నవించుకున్నారు. తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy