Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీరజ్ చోప్రా తదుపరి జావెలిన్ ఈవెంట్ ఎప్పుడంటే..

నీరజ్ చోప్రా తదుపరి జావెలిన్ ఈవెంట్ ఎప్పుడంటే..

స్పోర్ట్స్ డెస్క్: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

శుక్రవారం జరిగిన ఫైనల్లో తన రెండో ప్రయత్నంలో ఈ సీజన్ అత్యుత్తమ త్రోగా 85.83 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. లంక అథ్లెట్ రుమేశ్ తరంగ పతిరాగే పసిడి పతకం సాధించగా, భారత్‌కే చెందిన యశ్ వీర్ సింగ్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

గతేడాది సెప్టెంబర్ నుంచి దిగువ వీపు (Lower Back) గాయంతో బాధపడుతున్న నీరజ్ చోప్రా, సుదీర్ఘ పునరావాస (Rehab) శిక్షణ తర్వాత ఈ ఏడాదితో కలుపుకొని బరిలోకి దిగడం ఇది రెండోసారి మాత్రమే. జూన్‌లో జరిగిన దోహా డైమండ్ లీగ్‌లో నాలుగో స్థానంలో నిలిచిన నీరజ్, ఆ తర్వాత రబత్, రోమ్ లీగ్‌లకు దూరంగా ఉంటూ తుర్కియేలో కోలుకున్నాడు. గాయం ప్రభావం ఇంకా ఉన్నప్పటికీ, క్రమంగా పూర్వపు ఫామ్‌ను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు నీరజ్ తెలిపాడు.

నీరజ్ చోప్రా తదుపరి షెడ్యూల్:

ఈ పతకం తర్వాత నీరజ్ చోప్రా దృష్టి తదుపరి అంతర్జాతీయ టోర్నీలపై పడింది.

  • ఆగస్టు 21: లాసాన్ డైమండ్ లీగ్

  • ఆగస్టు 27: జ్యూరిచ్ డైమండ్ లీగ్

  • సెప్టెంబర్ 4-5: బ్రస్సెల్స్‌లో జరగబోయే డైమండ్ లీగ్ ఫైనల్స్

సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లోని ఐచి నాగోయా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్‌కు ముందు ఈ డైమండ్ లీగ్ పోటీల్లో పాల్గొని తన ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపరచుకోవాలని నీరజ్ భావిస్తున్నాడు. ప్రస్తుతం డైమండ్ లీగ్ పాయింట్ల పట్టికలో నీరజ్ 5 పాయింట్లతో 7వ స్థానంలో ఉన్నాడు. సెప్టెంబర్‌లో జరిగే ఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే రాబోయే రెండు లీగ్‌లలో కనీసం ఒకదానిలోనైనా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. 2022లో డైమండ్ లీగ్ ట్రోఫీని గెలుచుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన నీరజ్, ఆసియా గేమ్స్‌లో మళ్లీ పసిడి పతకాన్ని సాధించడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాడు.

strong>

కామన్వెల్త్ గేమ్స్: భారత్ ఖాతాలో మరో రెండు పసిడి పతకాలు

కామన్వెల్త్ గేమ్స్ 2026 విజేతలను ప్రశంసించిన ప్రధాని మోదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy