ఒక రైతుకు యూరియా నెలకు 50 బస్తాలే
కేంద్రం ప్రభుత్వం తాజా ఆదేశాలు
హైదరాబాద్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): తాము సబ్సిడీ ఇస్తున్న ఎరువులను ఒకేసారి కొనుగోలు చేసే పద్ధతికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. సబ్సిడీ ఇస్తున్న యూరియాను ఒక రైతు నెలకు 50 బస్తాలు మించి కొనడానికి వీలులేదు. ఈ మేరకుగురువారం ఆదేశాలు జారీ చేసింది. ఎరువుల ధరలు పెరగొచ్చని లేదా మళ్లీ మళ్లీ డీలరు వద్దకు రాలేమనే ఉద్దేశంతో రైతులు సీజన్కు సరిపడా ఒకేసారి ఎరువులను కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు. ఇది కూడా పంట సీజన్ మొదలైన సమయంలోనే ఉంటుంది. దీంతో ఒక్కోసారి కొరత ఏర్పడుతోంది. రైతుల డిమాండ్కు అనుగుణంగా ఎరువులను అందించడం కూడా కష్టమవుతోంది.
