Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత!!

పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత!!

ఇంటర్‌నెట్ డెస్క్: మదరసా విస్తరణ కోసం 100 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని కూల్చేసిన ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. న్యూస్ ఏజెన్సీ పీటీఐ రిపోర్టు ప్రకారం..

లాహోర్‌కు దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరోవాల్ జిల్లాలోని 'సిరాజ్' అనే గ్రామంలో 100 ఏళ్లనాటి ఓ ఆలయం ఉంది. ఆ ఆలయం సుమారు 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఆలయం పక్కనే మదరసా ఉంది.

నిషేధిత తీవ్రవాద ఇస్లామిక్ పార్టీ 'తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్'కి చెందిన కొందరు వ్యక్తులు మదరసాను విస్తరించటం కోసం ఆగస్టు 21వ తేదీన ఆలయాన్ని కూల్చివేశారు. ఆలయ శిఖరానికి సంబంధించిన మెటల్ ఫిట్టింగులను, ఇటుకలను అక్కడి నుంచి తరలించారు. హక్కుల కార్యకర్తలు ఈ సంఘటనపై వెంటనే దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కూలగొట్టిన చోటే ఆలయాన్ని పునర్నిర్మించాలని స్థానిక నాయకులు, మైనారిటీ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.

ఈ సంఘటనపై ప్రభుత్వ వాదనలు భిన్నంగా ఉన్నాయి. 100 నుంచి 125 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ గుడి భారీ వర్షాల కారణంగా కూలిపోయిందని ప్రభుత్వం అంటోంది. ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రభుత్వ రికార్డుల్లో గుడికి పేరు లేదు. అది చాలా పురాతనమైన గుడి. 100 నుంచి 125 సంవత్సరాల పాతది. భారీ వర్షాల కారణంగా గుడి కూలిపోయింది. ఆ భూమిని ఎవ్వరికీ లీజుకు ఇవ్వలేదు. గుడిని పునర్నిర్మించే బాధ్యత మా అధికారులు తీసుకుంటారు' అని తెలిపారు.

>

ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థానిక ఎన్నికలు జరగడం ఖాయం: మంత్రి నారాయణ

యూఏఈలో స్కామ్.. భారతీయులకు ఎంబసీ అలర్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy