ఢిల్లీ: తెలంగాణలో పసుపు రైతుల సమస్యలపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి లోక్సభలో ప్రస్తావించారు. పసుపు పంటకు కనీస మద్దతు ధర రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపు రైతులు ఆందోళనలో ఉన్నారని ఎంపీ అన్నారు. పంటను మొత్తం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు.

